News August 1, 2024
ఆదాయంలో విశాఖ రైల్వే స్టేషన్కు మొదటి స్థానం

తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో అత్యధిక ఆదాయం పొందిన తొలి 20 స్టేషన్ల జాబితాలో విశాఖ రైల్వే స్టేషన్కు మొదటి స్థానం దక్కిందని దువ్వాడ రైల్వే వినియోగదారుల సంఘం కార్యదర్శి కె.ఈశ్వర్ చెప్పారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూ.554.31 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. దువ్వాడ రైల్వే స్టేషన్ రూ.27.19 కోట్ల ఆదాయంతో 13వ స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News December 17, 2025
విశాఖ: హోంగార్డు టు సివిల్ పోలీస్

లక్ష్యాన్ని సాధించాలనే దృక్పథం ఉండాలే తప్ప ఏదైనా సాధించవచ్చు అని విశాఖకి చెందిన హోంగార్డు నిరూపించాడు. బాలాజీ 40 ఏళ్ల వయసులో హోంగార్డుగా ఐటీ కోర్లో పని చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి సిటీ సివిల్ పోలీస్గా ఎంపికయ్యాడు. యువతతో అన్ని విభాగాల్లోనూ పోటీపడుతూ ఉత్తమప్రతిభ చూపిస్తూ 6 నిమిషాల్లో 1,600 మీటర్లు పరిగెత్తి శభాష్ అనిపించుకున్నాడు. మంగళగిరిలో నిన్న నియామక పత్రం అందుకున్నాడు.
News December 17, 2025
విశాఖలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ

విశాఖ నుంచి విమానయాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడి నుంచి రోజుకు 28 దేశీయ విమాన సర్వీసులు.. వారానికి 2 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 8,500-9,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు కలవు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టిటివీ అవసరం ఎంతైనా ఉంది.
News December 17, 2025
విశాఖలో 102 మంది ఎస్ల బదిలీ

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.


