News February 15, 2025

ఆదిలాబాద్: అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

image

ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.

Similar News

News March 13, 2026

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టికెట్ ధరలు భారీగా పెంపు

image

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. ఈ మూవీ ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బెనిఫిట్ షోలు ఆ రోజు తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ప్రదర్శితమవుతాయి.

News March 13, 2026

MNCL: పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. 48 కేంద్రాల్లో ఉ.9.30 నుంచి 12.30గంటల వరకు జరిగే పరీక్షలకు 4, 897 మంది బాలురు, 4, 806 మంది బాలికలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News March 13, 2026

మంచిర్యాల: ఎస్సీ యువతకు GOOD NEWS

image

జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి పెంపొందించాలే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ నెల 17 నుంచి 24లోపు https:tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.