News August 23, 2024

ఆర్ఓఆర్ 2024తో రైతులకు ఎంతో ఉపయోగకరం: గుత్తా

image

ప్రస్తుత 2020 రెవెన్యూ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకుగాను ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ 2024 చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం NLG కలెక్టరేట్లో “తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు- 2024” ముసాయిదా పై ఏర్పాటు చేసిన సదస్సు, చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Similar News

News January 24, 2026

NLG: ఎన్నికలకు యంత్రాంగం సర్వం సిద్ధం!

image

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారుల సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని NLG కార్పొరేషన్, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల పుస్తకాలను మున్సిపల్ సిబ్బంది హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.

News January 24, 2026

ఏటేటా పడిపోతున్న కూరగాయల సాగు

image

జిల్లాలో కూరగాయ పంటలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతుంది. NLG నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దశాబ్ద కాలం క్రితం జిల్లాలో వందల ఎకరాలకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగయ్యేవి. ఇప్పుడు 30 శాతం కూడా సాగు చేయడం లేదు.

News January 24, 2026

NLG: సన్న బియ్యం ధరలకు రెక్కలు

image

నల్గొండ జిల్లాలో సామాన్యులకు సన్నబియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏటేటా బియ్యం రెట్టింపు అవుతున్నా అధికారులు కట్టడి చేయడం లేదు. గడిచిన నాలుగైదేండ్లుగా ఏటా వానకాలం సీజన్‌లో మిల్లుల వద్ద క్వింటా బియ్యం రూ.3వేల నుంచి రూ.3500 వరకు దొరికేది. ఈ ఏడాది గత పరిస్థితులకు భిన్నంగా వాటి ధరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5,500, పాతవి రూ.6,000 పలుకుతున్నాయి.