News March 15, 2025
ఆ గ్రామానికి వెళ్లాలంటే వీసా కావాలా?: తోపుదుర్తి

రాప్తాడు నియోజకవర్గంలోని పోలీసులు పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. తనను సిద్ధరాంపురం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఆ గ్రామం పాకిస్థాన్లో ఉందా? అందుకు ప్రత్యేక వీసాలు కావాలా? అని ప్రశ్నించారు. రాప్తాడు సీఐ, రామగిరి ఎస్ఐ పరిటాల కోసం పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
Similar News
News February 10, 2026
1300 మందితో బందోబస్తు: కరీంనగర్ సీపీ

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో నిఘా పెంచామన్నారు. సున్నిత కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 10, 2026
క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు: కలెక్టర్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం క్యాబ్ బుకింగ్ విధానంలోనే వ్యవసాయానికి డ్రోన్ సేవలను కూడా సులభంగా బుక్కు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులు, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఏలూరులో కలెక్టర్ ఆవిష్కరించారు.
News February 10, 2026
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 వార్డులు ఉండగా 1,85,348 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు 1,34,775 మంది, అశ్వారావుపేట 22 వార్డులు 16,850 మంది, ఇల్లందు 24 వార్డులు 33,723 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.


