News November 19, 2025
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్గా పరిగణిస్తారు.
Similar News
News January 14, 2026
అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.
News January 14, 2026
WPLలోనే తొలి ప్లేయర్

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన తొలి ప్లేయర్గా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ ఆయుషి సోనీ రికార్డులకెక్కారు. ముంబైతో మ్యాచులో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమె భారీ షాట్లు ఆడటంలో తడబడ్డారు. దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఔట్గా క్రీజును వీడారు. ఆ తర్వాత వచ్చిన ఫుల్మాలి 15 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
News January 14, 2026
BJPలోకి హరీశ్ అని ప్రచారం.. ఖండించిన BRS

TG: మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే హరీశ్ కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారని ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ కమలం గూటికి వెళ్లబోతున్నారని అందులో ఉంది.


