News March 5, 2025
ఇంటర్ ఎగ్జామ్.. HYDలో భారీగా ట్రాఫిక్

ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చింతల్ బస్టాండ్ నుంచి రిడ్జ్ టవర్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం ఈ ట్రాఫిక్లో చిక్కుకోవడం గమనార్హం. సంబంధిత అధికారులు ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఎగ్జామ్ సమయంలో ప్రధాన సర్కిళ్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News December 15, 2025
దేశంలోనే వృద్ధ ఎమ్మెల్యే కన్నుమూత

దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) మరణించారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో మరణించారని వైద్యులు తెలిపారు. 1969లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకరప్ప MPగానూ పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతిపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.
News December 15, 2025
సిరిసిల్ల: రెండో విడతలో ఎవరికి ఎన్ని సీట్లంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో బోయినపల్లి, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట మండలాలలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 88 గ్రామ పంచాయతీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 40 స్థానాలలో విజయం సాధించారు. ప్రతిపక్ష భారాస బలపరిచిన అభ్యర్థులు 30 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 6 చోట్ల, సీపీఎం 1, ఇతరులు 11 స్థానాలలో గెలుపొందారు.
News December 15, 2025
సిరిసిల్ల: జీపీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన 3 మండలాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పట్టు నిలుపుకున్నారు. తంగళ్ళపల్లి మండలంలో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇల్లంతకుంట మండలంలో అత్యధిక సీట్లు గెలుచుకుని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బోయినపల్లి మండలంలో అత్యధిక స్థానాలు దక్కించుకుని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.


