News December 2, 2025

ఇతిహాసాలు క్విజ్ – 84 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, యుద్ధంలో శారీరకంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమైంది ఎవరు?
సమాధానం: హనుమంతుడు. ఆయన పంచముఖుడు. చిరంజీవిగా బ్రహ్మదేవుడి వరం పొందాడు. యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా ఆయుధం ధరించి పాల్గొనలేదు. కానీ, పరోక్షంగా, అత్యంత ముఖ్యమైన రీతిలో సహాయం అందించి, ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News February 18, 2026

ఆత్మ గౌరవం కోసం మార్గదర్శకాలు

image

– నీ మాటలకు విలువ లేని చోట మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
– నిన్ను గౌరవించని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలబడకూడదు.
– ప్రేమ లేని చోట దాని కోసం ఆశ పడటం వ్యర్థం.
– నీకు నచ్చని, నువ్వు తప్పు చేయని విషయాలకు అనవసరంగా క్షమాపణలు చెప్పకు.
– నీకు నచ్చని పనుల గురించి ఇతరులకు వివరణలు ఇస్తూ కూర్చోకు.

News February 18, 2026

నెలకు రూ.82,720 జీతంతో ఉద్యోగాలు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(<>CSL<<>>)లో 64 ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ICAI, MBA(HR), పీజీ(సోషల్ వర్క్)ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు(రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ. 82,720 చెల్లిస్తారు. సైట్: cochinshipyard.in

News February 18, 2026

గొర్రెల్లో బొబ్బ రోగాన్ని ఎలా గుర్తించాలి?

image

బొబ్బరోగం ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.