News November 6, 2025

ఇదేం నిబంధన.. ‘7 క్వింటాళ్ల పరిమితిపై’ రైతుల ఆవేదన

image

నల్గొండ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి సేకరణలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ‘దిక్కుమాలిన నిబంధన.. ఏడ్చినట్టే ఉంది’ అని రైతులు మండిపడుతున్నారు. తేమశాతం, పింజ పొడవు నిబంధనలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవాలని వారు సీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Similar News

News January 20, 2026

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో ఓటు ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు.

News January 20, 2026

విశాఖ కలెక్టర్‌కు అవార్డు

image

విశాఖపట్నం జిల్లా ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

News January 20, 2026

ఓడరేవు అభివృద్ధిపై జిల్లా సలహా మండలి సమావేశం

image

నిజాంపట్నం ఓడరేవును అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఓడరేవు అభివృద్ధి జిల్లా సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవు అభివృద్ధి పనులతో పాటు సేవా పన్నుల సేకరణపై భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ సైదా తదితరులు పాల్గొన్నారు.