News May 7, 2025
ఇరగవరం: సొసైటీ కార్యదర్శి మృతిపై అనుమానాలు!

ఇరగవరం(M) కొత్తపాడు సొసైటీ కార్యదర్శి చల్లా సాయిబాబా మృతి ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రెండు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. అవి వెలుగులోకి వస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.
Similar News
News February 18, 2026
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం భీమవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు, మార్పుల క్లైమ్ల పరిష్కారంపై సమీక్షించారు. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 18, 2026
పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. జిల్లాలోని 132 కేంద్రాలలో 24,166 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
News February 18, 2026
పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. జిల్లాలోని 132 కేంద్రాలలో 24,166 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.


