News May 22, 2024

 ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి..

image

చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దామరచర్లలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నాగరాజు పెద్ద కుమారుడు నాగధనుష్, ఆయన మరదలు కుమారుడు పెద్ది శెట్టి సాత్విక్ కొంతమంది పిల్లలతో కలిసి గ్రామ శివారులోని నాగుల చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈక్రమంలో వారికి ఈత రాక మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News March 9, 2026

వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

image

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.

News March 9, 2026

నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్‌

image

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 9, 2026

నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్‌

image

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.