News September 11, 2025

ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: అనకాపల్లి డీఈవో

image

ఓపెన్ స్కూల్ ద్వారా దూరవిద్య విధానంలో పదవ తరగతి, ఇంటర్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అప్పారావు నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్ళు నిండినవారు పదవ తరగతిలో చేరి సెలవు దినాల్లో శిక్షణ పొంది పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. పదవ తరగతి పాస్ అయిన వారు కళాశాలలో చేరకుండా నేరుగా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పరీక్షలు రాయవచ్చునని అన్నారు.

Similar News

News December 17, 2025

ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్- కలెక్టర్ సత్యప్రసాద్

image

జగిత్యాల జిల్లాలో 3విడతలలో భాగంగా 6 మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, ఎండపల్లి, బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒంటిగంటలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

News December 17, 2025

ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.

News December 17, 2025

Way2News కథనానికి స్పందించిన సీతక్క

image

Way2News కథనానికి మంత్రి సీతక్క స్పందించారు. మంగపేట మండలం దోమడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఏటూరునాగారంలో ఈనెల 9న ప్రచారానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా మంగళవారం<<18583277>> ‘మంత్రి సీతక్క.. ఆదుకోవా’ <<>>అనే శీర్షిక Way2News ద్వారా ప్రచురించగా సీతక్క స్పందించారు. బాధితుడితో ఫోనులో మాట్లాడి చికిత్సకు తోడ్పడతానని హామీ ఇచ్చారు.