News September 11, 2025
ఈనెల 15 నుంచి పశువులకు టీకాలు: కలెక్టర్

ఈనెల 15నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయడం జరుగుతుందని పాడి రైతులంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
పోలింగ్ తేదీల్లో సెలవు.. కామారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లాలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా, పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే (డిసెంబర్ 11, 14 & 17) ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు సెలవు ఉంటుంది. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే ఉద్దేశంగా ఈ వీలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 10, 2025
బ్లాక్ మెయిల్ కాల్స్పై అప్రమత్తంగా ఉండండి: DEO

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DEO వెంకట లక్ష్మమ్మ మంగళవారం సూచించారు. ఎటువంటి కాల్స్ వచ్చినా రికార్డ్ చేయాలన్నారు. వాటిని లిఖితపూర్వకంగా సంబంధిత పోలీసులకు అందజేయాలన్నారు. కాల్స్కు భయపడి ఎవరికి నగదు చెల్లించవద్దని పేర్కొన్నారు.
News December 10, 2025
సంగారెడ్డిలో 1100 మందితో ఎన్నికల బందోబస్తు

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఏడు మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 1,100 మంది పోలీసు అధికారులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరీతోష్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 129 సర్పంచ్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


