News September 10, 2025

ఈనెల 15 నుంచి MNCLలో ఆగనున్న వందే భారత్

image

నాగపూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఈనెల 15 నుంచి నిలపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ హాల్టింగ్‌కు కేంద్ర రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. ప్రారంభ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. వందే భారత్ హాల్టింగ్‌పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 17, 2025

కడప: పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య..?

image

ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. చాగలమర్రి(M) గోట్లూరుకు చెందిన యువకుడు(24) మెకానిక్ పనిచేస్తుంటాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు. బ్యాంకులో పని ఉందని సోమవారం ఇంట్లో వాళ్లకు చెప్పి యువకుడు బయటకు వచ్చాడు. రాజుపాలెం మండలం వెల్లాల పొలాల్లోకి వచ్చి విషం తాగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 17, 2025

ఏపీలో 6 జోన్లు.. ఏ జిల్లా ఎక్కడంటే?

image

రాష్ట్రంలో 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా <<18586844>>కేంద్రం<<>> విభజించింది.
*జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, VZG, అనకాపల్లి.
*జోన్-2: అల్లూరి, తూ.గో., కాకినాడ, కోనసీమ.
*జోన్-3: ప.గో., ఏలూరు, కృష్ణా, NTR.
*జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.
*జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప.
*జోన్-6 : కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి.
*మల్టీజోన్-1: జోన్-1, 2, 3
*మల్టీజోన్-2: జోన్-4, 5, 6

News December 17, 2025

అద్దంకి: ఫైనాన్స్ వాయిదాల గొడవ.. వ్యక్తిపై దాడి

image

ఓ ఆటో ఫైనాన్స్ వాయిదాల విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు మంగళవారం C.I సుబ్బరాజు తెలిపారు. చెరువుకొమ్మపాలెం చెందిన ప్రసన్నాంజనేయులు (34) అనే వ్యక్తిపై ముగ్గురు ఫైనాన్స్ సిబ్బంది వాగ్వాదానికి దిగి దాడి చేసినట్లు తెలిపారు. ఘటనలో ప్రసన్నాంజనేయులు తలకు, మోకాలిపై గాయాలయ్యాయి. వ్యక్తిని అద్దంకి PHC తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని C.I అన్నారు.