News November 8, 2025

ఈనెల 16న కొత్తగూడెంలో జాబ్ మేళా

image

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన జాబ్ మేళాను 16వ తేదీకి మార్చబడిందని నిర్వాహకులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల కొత్తగూడెం క్లబ్లో మేళా ఉంటుందని చెప్పారు. పది నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని చెప్పారు. 65+ కంపెనీల్లో 3,500 ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నారు. ట్రాన్స్ జెండర్, చెవిటి, మూగ, దివ్యాంగులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉ.9 నుంచి సా.5 గంటల వరకు హాజరవ్వాలన్నారు.

Similar News

News January 18, 2026

ట్రంప్ మోసం చేశాడు: ఇరాన్ నిరసనకారులు

image

US అధ్యక్షుడు ట్రంప్ తమకు ద్రోహం చేశారని ఇరాన్‌ నిరసనకారులు మండిపడుతున్నారు. దాడికి సిద్ధంగా ఉన్నామని, సాయం త్వరలోనే అందుతుందని చెప్పి ఇప్పుడు పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను అణచివేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ‘దేశంలో 15 వేల మంది మరణానికి ట్రంప్ కారణం. మమ్మల్ని ఆయుధాలుగా వాడుకుని మోసం చేశారు. ఖమేనీ ప్రభుత్వంతో డీల్ చేసుకున్నారు’ అని ఆరోపిస్తున్నారు.

News January 18, 2026

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News January 18, 2026

VJA: గులకరాయి నిందితుడి ప్రేమాయణం..!

image

వైసీపీ అధినేత జగన్‌పై గతంలో గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు వేమూరి సతీశ్ కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ సింగ్‌ నగర్‌కు చెందిన ఇతను ఓ మైనర్ బాలికను ప్రేమించి, పెళ్లి చేయాలంటూ శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బాలిక వయసు రీత్యా మైనర్ కావడంతో పోలీసులు సతీశ్‌‌పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని జైలుకు తరలించారు.