News June 19, 2024
ఈనెల 21న హిందూస్థాన్ షిప్యార్డ్ వ్యవస్థాపక వేడుకలు

హిందుస్థాన్ షిప్ యార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈనెల 21వ తేదీన నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు మంగళవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా ఉద్యోగులకు అత్యవసర వైద్య సేవలు అందించే యార్డులో ఆసుపత్రిని ఆధునీకరించారు. ఉద్యోగుల నివాస సముదాయంలో 36 క్వార్టర్స్ను 3 దశలో మరమ్మతులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News January 18, 2026
విశాఖ జిల్లా ఆర్టీసీ ఆదాయం రూ.కోటి ఇరువై లక్షలు

సంక్రాంతి పండుగలు ముగించుకొని విశాఖ నుంచి తిరిగి వెళుతున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ద్వారకా బస్సు కాంప్లెక్స్లో రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం పర్యవేక్షణ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ సర్వీసుల సంఖ్య పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాకు ఆర్టీసీ ద్వారా రూ. కోటి ఇరువై లక్షలు ఆదాయం సమకూరినట్టు తెలిపారు.
News January 18, 2026
విశాఖ: 17 రోజుల్లో రూ.120 కోట్ల మద్యం తాగేశారు

విశాఖలో ఈనెల మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విశాఖ పరిధిలో 280 మద్యం దుకాణాల ద్వారా 1,52,000 లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 81000 బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు డిపో మేనేజర్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది కంటే ఐదు శాతం ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు.
News January 18, 2026
బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన నేతలు

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని విశాఖలో నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


