News November 19, 2025
ఈనెల 23న రాప్తాడుకు వైఎస్ జగన్

ఈనెల 23న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాజీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి చర్చించారు.
Similar News
News January 24, 2026
KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.
News January 24, 2026
సిరిసిల్ల: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించారు. ఈ మేరకు ఇంఛార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్లెక్సిపై బాలికలను ఉద్దేశించి స్కై ఇస్ ద లిమిట్ అని రాశారు.
News January 24, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

*గద్వాల: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
*రేపు పలు కాలనీలకు పవర్ కట్
*వేరుశనగకు రికార్డ్ ధర రూ.9,389
*అలంపూర్: సీఐగా ప్రదీప్ కుమార్
*శక్తిపీఠంలో భక్తుల సందడి
*అయిజ: బాల్యవివాహాలు భవిష్యత్తుకు అడ్డంకులు
*మానవపాడు: లైన్మెన్ను నియమించాలని వినతి
*ఎర్రవల్లి: అక్రమ చేపల చెరువులపై చర్యలు తీసుకోవాలి
*కేటిదొడ్డి: గణతంత్ర వేడుకలకు పాఠశాలలు ముస్తాబు
*ధరూర్: కనులపండువగా అంజన్న రథోత్సవం


