News December 2, 2025
ఈనెల 7న జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్ష: కలెక్టర్

జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు ఈ నెల 7వ తేదీన జరుగుతాయని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.
ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి నాలుగేళ్ల పాటు సంవత్సరానికి రూ. 12,000 చొప్పున ఉపకార వేతనం లభిస్తుందని తెలిపారు.
Similar News
News February 17, 2026
రీ-సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో నక్షలు లేని గ్రామాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. నక్షలు లేని గ్రామాల్లో భూసర్వే ఖచ్చితత్వంతో పూర్తి చేసి, భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
News February 17, 2026
నియోజకవర్గ సమస్యలపై సీఎం రివ్యూ

అల్లూరి, పోలవరం, మన్యం జిల్లాల సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబు మంగళవారం రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలలో టీడీపీ ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అల్లూరి, పోలవరం కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్ధర్తో పాటు మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. రివ్యూలో రంపచోడవరం నియోజకవర్గంలోని ప్రతి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే శిరీష దేవి తెలిపారు.
News February 17, 2026
రేపటి నుంచి శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామన్నారు. 15 రోజుల్లోపు అన్నదాతల అకౌంట్లకే డబ్బులు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా 2026-27 రబీ సీజన్కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.


