News April 6, 2024

ఈనెల 8న అచ్యుతాపురంలో వారాహి యాత్ర

image

అచ్యుతాపురంలో ఈనెల 8వ తేదీన నిర్వహించే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్, టిడిపి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరావు పిలుపునిచ్చారు. మండలంలో లాలం కోడూరు గ్రామంలో వారు మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఈ సభకు హాజరుకావాలని కోరారు. జనసేన- బీజేపీ- టీడీపీలకు చెందిన వారందరూ పాల్గొంటారని తెలిపారు.

Similar News

News January 18, 2025

నేడు విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు శనివారం విశాఖ నుంచి చర్లపల్లికి (08549/50)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. ఈరోజు సాయంత్రం విశాఖలో 7:45కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మీదుగా రేపు తెల్లవారి 7 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 2nd AC, 3rd AC, స్లీపర్, జనరల్ ఉంటాయాన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News January 18, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లాప్‌టాప్, రెండు మొబైల్స్, 80 బ్యాంకు అకౌంటులను స్వాధీనం చేసుకొని వాటిలో రూ.140కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లావాదేవీలకు సహకరించిన నలుగురుని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.

News January 18, 2025

విశాఖ: నేడు స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్.. కలెక్టర్ సూచనలు

image

స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్య‌క్ర‌మంలో జిల్లా యంత్రాంగం భాగస్వామ్యం కావాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, గార్బేజ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సూచించారు.