News October 7, 2025

ఈనెల 8 నుంచి సదరం శిబిరాలు: కలెక్టర్

image

జిల్లాలో అప్పీలు చేసుకొన్న దివ్యాంగుల పెన్షన్ల అంచనాకు మళ్లీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సదరం శిబిరాలను ఈ నెల 8 నుంచి GGH, రాజమండ్రి, అనపర్తి ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. తక్కువ శాతం దివ్యాంగత్వం ఉండి, పెన్షన్ పొందడానికి అర్హత లేని వారిగా గతంలో నోటీసులు అందుకొన్న వారికి పునఃపరిశీలన చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News January 23, 2026

ప్రాథమిక రంగ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం: ఇన్ఛార్జి కలెక్టర్

image

తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగంలో పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖలు పోస్ట్‌ హార్వెస్టింగ్ యూనిట్లను.. పశుసంవర్ధక శాఖ డైరీ, పాల ఉత్పత్తులకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లను ప్రోత్సహించాలన్నారు.

News January 23, 2026

తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

News January 23, 2026

తూ.గో. జిల్లాలో కలిసిన 4 పోలీస్ స్టేషన్‌లు

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూ.గో జిల్లాలో విలీనం చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని మండపేట టౌన్, రూరల్, అంగర, రాయవరం పోలీస్ స్టేషన్లు రాజమహేంద్రవరం తూర్పు మండలం పరిధిలోకి వచ్చాయి. అలాగే, తూర్పు మండలంలోని బొమ్మూరు స్టేషన్‌ను దక్షిణ మండలానికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.