News November 8, 2025

ఈనెల 9న ప్రారంభం కానున్న KU దూరవిద్య పీజీ కాంట్రాక్టు తరగతులు

image

కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ కాంట్రాక్టు తరగతులు నవంబరు 9 నుంచి ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ప్రొ.బి.సురేశ్ తెలిపారు. నవంబరు 9, 11, 23, 30తో పాటు డిసెంబరు 7, 13, 14, 21, 28వ తేదీల్లో ఉ.10 గం.కు తరగతులు జరుగుతాయన్నారు. ఎంఏ, ఎంకామ్ కోర్సులు కేయూ కేంద్రం, మంచిర్యాల, ఖమ్మం, మణుగూరు తదితర అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 16, 2026

పాలమూరు: ‘KCR హయాంలో ప్రాజెక్ట్‌లు నిర్లక్ష్యం’

image

మాజీ సీఎం KCR పాలనలో తెలంగాణలోని ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను గాలికి వదిలేశారన్నారు. గోండు గూడెంలలో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు.

News January 16, 2026

నిజామాబాద్ ఫస్ట్.. నల్గొండ సెకండ్

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 5.23 లక్షల టన్నులతో జిల్లా రెండో స్థానంలో ఉండగా, 6.93 లక్షల మెట్రిక్ ​టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వారంలోగా నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపలేదు.

News January 16, 2026

గుర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

image

గుర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు . పండగ సందర్భంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేరే విధంగా చూడాలని ఎస్సై నారాయణరావుకు సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.