News March 31, 2024

ఈవీఎం గోడౌన్స్ తనిఖీ చేసిన పల్నాడు కలెక్టర్

image

పల్నాడు జిల్లాలోని ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భద్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ శివశంకర్ శనివారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్‌లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 17, 2026

ఉగాది నాటికి గృహ నిర్మాణాలే లక్ష్యం: కలెక్టర్

image

ఉగాది నాటికి నిర్దేశిత గృహ లక్ష్యాలు పూర్తిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనులపై కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, MPDOలతో కలెక్టర్ వీసీ నిర్వహించారు. జిల్లాలో 22,952 గృహాలు పూర్తి చేయాలని అన్నారు. దీనిని పూర్తి చేయుటకు మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు శ్రద్ధ పెట్టాలన్నారు.

News February 17, 2026

GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News February 17, 2026

GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.