News November 19, 2025
ఈ గణపతి రూపం బాధలను పోగొడుతుంది

10 చేతులు, 5 తలలు గల హేరంబ గణపతిని దర్శిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ గణపతిని ధ్యానించిన తర్వాతే పరమ శివుడు త్రిపురాసురుడుని సంహరించగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఫలితంగానే స్వర్గంలో ఇంద్రుడు సహా త్రిమూర్తులు తమ స్థానాల్లో ఉండగలిగారట. అందుకే గణపతికి తొలి పూజలు చేస్తారు. ఈయనను కొలిస్తే.. శుభాలు కలుగుతాయని, సంసార సాగరాన్ని సునాయసంగా దాటేయగలరని పండితులు చెబుతున్నారు.
Similar News
News January 23, 2026
పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులు: లోకేశ్

AP: ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్కు రాష్ట్రం గమ్యస్థానమని మంత్రి లోకేశ్ తెలిపారు. APకి 160GW పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉందన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ-గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులుగా మారాయని తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుంటే డేటా సెంటర్లు, AI కంప్యూట్ రంగాలను విస్తరించలేమని దావోస్ రెన్యూ పవర్ మీటింగ్లో చెప్పారు.
News January 23, 2026
DRDOలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 23, 2026
నిన్న విజయసాయి రెడ్డి.. మిథున్ రెడ్డి

AP: మద్యం కుంభకోణం కేసులో ED విచారణకు YCP MP మిథున్రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్లోని ED కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని.. మిథున్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశానని నిన్న విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.


