News November 19, 2025

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

image

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. పాలక మండలి పదవీ కాలం కేవలం 2 నెలలు మాత్రమే ఉండటంతో పలు నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుందని సమాచారం. తమ డివిజన్లలో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేసే అవకాశముంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ అధిక నిధులు విడుదల చేశారని.. తమకు కూడా విడుదల చేయాలని కోరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News January 17, 2026

HYD: ఒకేసారి 20 మంది IPS అధికారుల బదిలీ

image

ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. DGP ఆదేశాల మేరకు 20 మంది IPSలు బదిలీ అయ్యారు. గజరవు భూపాల్, అభిషేక్ మహంతి, భాస్కరన్, చందనా దీప్తి, అన్నపూరణ, రహుల్ హెగ్డే, అపూరవరవు, బాలస్వామి, వెంకటేశ్వరులు, చైతన్య కుమార్, అవినాశ్ కుమార్, కాజల్, శేషాద్రిని రెడ్డి, కంకనాల రాహుల్ రెడ్డి, శివం ఉపాధ్యాయ, శ్రీనివాసులు, రంజన్ రథన్ కుమార, శ్యామ్ సుందర, అశోక్, బాలకోటి బదిలీ అయ్యారు.

News January 17, 2026

IIIT హైదరాబాద్ బంపర్ ఆఫర్: ఇంటి నుంచే డేటా సైన్స్‌లో మాస్టర్స్!

image

IIIT-H వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ఎంఎస్సీ డేటా సైన్స్‌ను లాంచ్ చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండానే అడ్మిషన్ పొందే ఈ రెండేళ్ల కోర్సును, ఉద్యోగం చేస్తూనే నాలుగేళ్లలోపు పూర్తి చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12లోపు dfl.iiit.ac.in లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.4 లక్షల ఫీజు. ఏప్రిల్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.
SHARE IT

News January 17, 2026

హైదరాబాద్‌లో ‘ఆమె’దే హవా!

image

SEC నిబంధనల ప్రకారం GHMC మేయర్ పదవి మహిళా (జనరల్) కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. గతంలో MCHకు రాణి కుముదిని దేవి తొలి మహిళా మేయర్‌. ఆ తరువాత సరోజినీ, కుముద్ నాయక్ నగరాన్ని పాలించారు. GHMC ఏర్పడ్డాక 2007లో TDP నుంచి సరస్వతి దేవి మేయర్‌ అయ్యారు. ఆ తర్వాత బండ కార్తీక రెడ్డి సేవలు అందించగా, ప్రస్తుతం గద్వాల్ విజయలక్ష్మి 2021 నుంచి కొనసాగుతున్నారు. ఇలా మేయర్ పీఠంపై మహిళల ముద్ర ఎప్పట్నుంచో ఉంది!