News March 31, 2024
ఉండవల్లి: ఓటీపీ చెప్పడంతో రూ.83,286 స్వాహా!

ఉండవల్లి: ఓటీపీ చెప్పడంతో బ్యాంకు ఖాతాలో నగదు పోయిన ఘటనపై ఉండవల్లి PSలో శనివారం కేసు నమోదైంది. SI శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు రమాదేవి ఆన్లైన్లో వాచ్ బుక్ చేసింది. వెంటనే వద్దనుకుని రద్దు చేసేందుకు వివరాల కోసం వెతికింది. ఆర్డర్ రద్దు చేయాలంటే ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో అలాగే చేసింది. కొద్దిసేపట్లో ఆమె ఖాతాలో రూ.83,286 డ్రా అయ్యాయి.
Similar News
News February 17, 2026
జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 17, 2026
పాలమూరు: యూరియా..Booking చేసుకోండి ఇలా!

✒Google Play నుండి “Fertilizer Booking App”ను ఇన్స్టాల్
✒మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి, ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి
✒పట్టాదారు పాస్బుక్ నంబర్, ఆధార్, పంట వివరాలు నమోదు చేయాలి
✒సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ లభ్యతను తనిఖీ చేసి, కావలసిన బస్తాల సంఖ్యను ఎంచుకుని బుక్ చేసుకోవాలి
✒48 గంటల్లోపు డీలర్ వద్దకు వెళ్లి తీసుకోవాలి
✒15 రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకోవచ్చు
#SHARE IT
News February 17, 2026
MBNR: మేయర్, డిప్యూటీ మేయర్ వేతనాలు ఎంతో తెలుసా..!

మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా ముగిశాయి. ఎంతోమంది ఎన్నో ఎన్నో లక్షల ఖర్చు చేసుకుని ఎన్నికల్లో పోటీపడి కార్పొరేటర్గా గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కూడా గట్టి పోటీ ఉంటుంది. మేయర్ నెలసరి వేతనం రూ.65 వేలు ఉంటుంది. అలాగే డిప్యూటీ మేయర్కు రూ.32,500, అలాగే కార్పొరేటర్కు రూ.7,800 వేతనాలు ఉంటాయి.


