News November 19, 2025

ఉత్త‌రాంధ్ర‌లో అంచ‌నాల కమిటీ ప‌ర్య‌ట‌న‌

image

AP అంచ‌నాల క‌మిటీ ఈనెల 25-29 వ‌రకు ఉత్త‌రాంధ్రలో ప‌ర్య‌టించ‌నుంది. ఛైర్మ‌న్ వేగుళ్ల జోగేశ్వ‌రరావు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ స‌భ్యులు 25న విశాఖ‌ చేరుకుంటారు. 26న సింహాచ‌లంలో స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మావేశమౌతారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్‌‌లో అధికారులతో చ‌ర్చించ‌నున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షిస్తారు.

Similar News

News January 17, 2026

KGHలో ఆన్‌లైన్ వైద్య సేవలు

image

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్‌లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.

News January 17, 2026

విశాఖ: రాజు గారి ఆవేదన వెనుక కారణం ఇదేనా?

image

విశాఖ MLA విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వీటి వెనుక రాజకీయాలకన్నా టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల అంశమే ప్రధాన కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిల్లుల రూపంలో విష్ణు కుటుంబానికి సుమారు రూ.120 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం టిడ్కో బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

News January 16, 2026

విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.