News November 19, 2025

ఉత్త‌రాంధ్ర‌లో అంచ‌నాల కమిటీ ప‌ర్య‌ట‌న‌

image

AP అంచ‌నాల క‌మిటీ ఈనెల 25-29 వ‌రకు ఉత్త‌రాంధ్రలో ప‌ర్య‌టించ‌నుంది. ఛైర్మ‌న్ వేగుళ్ల జోగేశ్వ‌రరావు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ స‌భ్యులు 25న విశాఖ‌ చేరుకుంటారు. 26న సింహాచ‌లంలో స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మావేశమౌతారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్‌‌లో అధికారులతో చ‌ర్చించ‌నున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షిస్తారు.

Similar News

News January 19, 2026

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏయూ విద్యార్థులకు పోటీలు

image

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు NSS భవనంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఆర్ట్స్ కళాశాల పరిధిలోని చిత్రలేఖన విభాగంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తారు. విజేతలకు 26వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని అధికారులు సూచించారు.

News January 19, 2026

విశాఖ మీదుగా కొత్త ‘అమృత్ భారత్’ రైళ్లు

image

విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రెండు కొత్త వీక్లీ ‘అమృత్ భారత్’ రైళ్లను రైల్వే శాఖ ఖరారు చేసింది. (20604/20603) నాగర్‌కోయిల్ – న్యూ జల్‌పాయిగురి నాగర్‌కోయిల్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. ట్రైన్ (20610/20609) తిరుచిరాపల్లి -న్యూ జల్‌పాయిగురి – తిరుచిరాపల్లి జనవరి 28 నుంచి ప్రారంభమవుతోంది. ఈ రైళ్లు దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.

News January 19, 2026

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 57 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 57 వినతులు వచ్చాయి. ఈ వినతులను కమిషనర్ కేతన్ గార్గ్ తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 3, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యం విభాగానికి 4, పట్టణ ప్రణాళిక విభాగానికి 30, ఇంజినీరింగు విభాగానికి 15, మొక్కల విభాగానికి ఒకటి వచ్చిందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.