News August 25, 2024
ఉదయగిరి కొండపై మంటలు (PHOTO)

ఉదయగిరి పట్టణ శివారులోని దుర్గం కొండపై ఆదివారం రాత్రి మంటలు వచ్చాయి. వన్య ప్రాణులకు ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వన భోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకతాయిలు ఎవరైనా సిగరెట్ పడేసి ఉంటారని లేదా పొయ్యి వెలిగించి చల్లార్చకపోవడంతో మంటలు వచ్చి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 19, 2026
నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.
News January 19, 2026
నెల్లూరు: 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు జనవరి 21, 22వ తేదీలలో తిరుపతి జిల్లా అలిపిరి రోడ్డులోని DMHO కార్యాలయం నందు హాజరుకావాలని సూచించారు.
News January 19, 2026
నెల్లూరు: ఇరిగేషన్లో రూ.100 కోట్లు పక్కదారి!

మొంథా తుఫాను నిధులు పక్కదారి పట్టాయి. జిల్లాకు రూ.100 కోట్లు మంజూరైతే.. పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు. ఈ వ్యవహారంలో ఓ DAO తన కొడుకు, బంధువుల ఫోన్ పేకి అమౌంట్ ట్రాన్సఫర్ చేయించుకోవడంతో అవినీతి బట్ట బయలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయికి చేరడంతో విచారణ అధికారి వచ్చి వెళ్లారు కానీ ఫైళ్లు ముందుకు కదలలేదు. తుఫానుతో చెరువులు కరకట్లు, షట్టర్లు, కాలువల మరమ్మతుల చేపట్టిన దాఖలాలు లేవు.


