News March 31, 2024
ఉదయగిరి: 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

ఉదయగిరి మండలంలో ఏప్రిల్ 3 నుంచి 8వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది వితంతు వృద్ధాప్య దివ్యాంగ తదితర పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎంపీడీవో డి.ఈశ్వరమ్మ తెలిపారు. మండలంలో 194 మంది వాలంటీర్లు ఉండగా వారి నుంచి మొబైల్ సిమ్ బయోమెట్రిక్ యంత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
Similar News
News February 17, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

వింజమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన కూరపాటి సురేంద్ర (27) మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెడికల్ షాపులో పనిచేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే సురేంద్ర మరణవార్త విని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి రెండేళ్ల క్రితమే వివాహం జరగగా, ఏడాది వయసున్న పాప ఉంది.
News February 17, 2026
నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
News February 17, 2026
నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.


