News October 5, 2024

ఉపాధ్యాయులను వైసీపీ అగౌరవంగా చూసింది: మంత్రి నిమ్మల

image

ఉపాధ్యాయులను గత వైసీపీ ప్రభుత్వం అగౌరవంగా చూస్తే, నేటి కూటమి ప్రభుత్వం గౌరవిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో ధర్మారావు ఫౌండేషన్ తరఫున 125 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రామచంద్ర గార్డెన్స్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను వైన్ షాపులు వద్ద కాపలా పెట్టారన్నారు.

Similar News

News January 22, 2026

ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్‌, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్‌, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 21, 2026

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

image

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.