News May 22, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్ష సూచన

image

ఉమ్మడి అనంత జిల్లాలో ఈనెల 25న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం కురుస్తుందన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్‌లలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Similar News

News September 29, 2024

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్

image

గోరంట్ల మండలంలోని దిగువ గంగం పల్లి తండాలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాన్ని ఆదుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంఘటనా ప్రాంతానికి పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, గోరంట్ల తహశీల్దార్ మారుతి, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలపై నివేదికను అందజేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం తెలపడం మృతుల కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

News September 29, 2024

ఘర్షణలో కిందపడి వ్యక్తి మృతి

image

పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకటేశ్-ఆదినారాయణ మధ్య చిన్నపాటి విషయంపై ఘర్షణ జరిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణను వెంకటేశ్ కిందకు తోసేశాడు. దీంతో ఆదినారాయణ కింద పడి మృతిచెందాడు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News September 29, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగు పాటు.. భార్య, భర్త మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగంపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పిడుగు పాటుకు గురై భార్య, భర్తలు దాశరథి నాయక్, దేవి బాయి మృతిచెందారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడటంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు.