News January 21, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటినుండి గ్రామసభలు. @ మెట్పల్లి మండలంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు. @ భీమదేవరపల్లి మండలంలో గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు. @ ముత్తారం మండలంలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో పోలీసుల తనిఖీలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
Similar News
News February 12, 2025
KNR: విద్యార్థుల్లో కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్

విద్యార్థులు దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ఉపాధ్యాయుల గుర్తించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన హస్తకళ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కస్తూర్బా బాలికల పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను పరిశీలించారు.
News February 12, 2025
కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా?

ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
News February 12, 2025
కరీంనగర్: బీసీ స్టడీ సర్కిల్లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ కోసం 539 మంది దరఖాస్తు చేసుకున్నారని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ వరకు స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు. 15 నుంచి తరగతులు ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..