News February 17, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

image

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.

Similar News

News March 16, 2026

అమెరికాలో వరంగల్ యువ ఇంజినీర్ మృతి!

image

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాకేష్(40) గుండెపోటుతో మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం ఘటన జరిగింది. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిన రాకేశ్ కుటుంబంతో కలిసి విరిగినియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ స్థిరపడ్డారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

News March 16, 2026

శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 105 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. జిల్లాలోని 145 కేంద్రాల్లో పరీక్షలు జరగగా 28,637 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 28,532 మంది హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షకు 575 మంది విద్యార్థులకు గాను 85 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.

News March 16, 2026

కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

image

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.