News April 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు.
*పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.
*వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించిన ఎండోమెంట్ కమిషనర్.
*కొండగట్టులో ఘనంగా చిన్న హనుమాన్ జయంతి.
*జగిత్యాల రూరల్ మండలంలో యువకుడి దారుణ హత్య.
*కరీంనగర్ పార్లమెంటుకు నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్.
*కొండగట్టులో బస్సు ఎక్కుతూ జారి బస్సు కిందపడి ఒకరి మృతి.

Similar News

News January 23, 2025

శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించనున్న మంత్రి పొన్నం

image

రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 09.00 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారనీ మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రులతో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

News January 23, 2025

కరీంనగర్: స్పౌజ్ కేటగిరికి దరఖాస్తులు

image

స్పౌజ్ బదిలీలకు సంబంధించి ముందడుగు పడింది. వివిధ జిల్లాల నుంచి కరీంనగర్‌కు 143 మంది టీచర్స్ రానున్నారు. ఈ మేరకు వారు డీఈవో ఆఫీసులో రిపోర్ట్ చేశారు. వారికి త్వరలో కౌన్సెలింగ్ జరగనుంది. వీరంతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట నుంచి బదిలీపై రానున్నారు.

News January 22, 2025

సిరిసిల్ల: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు సమర్పించని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు SRCL కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. రుద్రంగి గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 103, రైతు భరోసా కింద 1927, నూతన రేషన్‌కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.