News May 1, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మే డే దినోత్సవ వేడుకలు. @ బీర్పూర్ మండలంలో గుండెపోటుతో కార్మికుడి మృతి. @ సారంగాపూర్ మండలంలో వడదెబ్బతో ఐదేళ్ల బాలుడి మృతి. @ కోరుట్ల లో నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ కేసులకు భయపడేది లేదన్న రేవంత్ రెడ్డి. @ ముత్తారం మండలంలో గుడుంబా స్థావరాలపై దాడులు.
Similar News
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.
News December 17, 2025
కరీంనగర్: ఉ.9 వరకు 29,028 మంది ఓటేశారు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజూరాబాద్లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వీ.సైదాపూర్లో 8.14% పోలింగ్ నమోదైంది.
News December 17, 2025
ఓటమి ఎరగని మానకొండూరు సర్పంచ్ దంపతులు

మానకొండూరు మండల కేంద్రం సర్పంచ్ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ దంపతులు 2001 నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తున్నారు. 2001లో శేఖర్ గౌడ్ ఎంపీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2013లో ఆయన భార్య వర్షిణి సర్పంచ్గా గెలిచారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజారిటీ (13,652) ఓట్లు సాధించారు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్గా BRS అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.


