News December 1, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులు Dy.CM పర్యటన

image

Dy.CM మల్లు భట్టి విక్రమార్క 2 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మంలో జరిగే నూతన డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధిరలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటనలో వివరించారు.

Similar News

News February 12, 2026

కాకినాడ పోలీస్ శాఖకు ‘సీ పోర్ట్స్’ గిఫ్ట్.. రూ.12 లక్షల వాహనం బహూకరణ

image

కాకినాడ ‘సీ పోర్ట్స్’ లిమిటెడ్ (SPL) కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా పోలీస్ శాఖకు రూ.12 లక్షల విలువైన మహీంద్రా బొలెరో వాహనాన్ని బహూకరించింది. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ వాహన తాళాలను అందుకుని, జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ యంత్రాంగానికి అండగా నిలిచిన సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

News February 12, 2026

తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.

News February 12, 2026

పెద్దపల్లి : ఓటింగ్‌లో మగువలే మేటి!

image

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,28,023 మంది మహిళా ఓటర్లకు గానూ 91,873 మంది పోలింగ్‌లో పాల్గొనడంతో 71.76 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండంలో 62,868, పెద్దపల్లిలో 16,319, సుల్తానాబాద్‌లో 7,023, మంథనిలో 5,663 మంది మహిళలు ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో మహిళా లోకం చైతన్యం చూపిస్తూ పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం విశేషం.