News September 9, 2025

ఉమ్మడి పాలమూరులో కొత్తగా రైళ్ల స్టాప్‌లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త‌గా మ‌రో 6 నుంచి 7 రైళ్ల రాక‌పోక‌లు, స్టాప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్‌లో 2, మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కృష్ణా రైల్వే స్టేష‌న్‌లో 3, జ‌డ్చ‌ర్ల రైల్వే స్టేష‌న్‌లో మ‌రో 2 రైళ్ల‌స్టాప్‌లు, అద‌న‌పు రాక‌పోక‌లకు ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 17, 2025

ఆముదంతో చర్మం, గోళ్ల సంరక్షణ

image

చర్మం ముడతలు పడకుండా చేసే గుణాలు ఆముదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘చమురు రాసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆముదంతో రోజూ 10ని. గోళ్లకు మర్దన చేసుకుంటే అవి దృఢంగా మారి విరగకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు, నిద్ర లేచాక చమురు రాసుకుంటే పెదవులు కోమలంగా ఉంటాయి’ అని చెబుతున్నారు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉంటే మంచిందంటున్నారు.

News December 17, 2025

జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

image

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్‌ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు సమాచారం.

News December 17, 2025

గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

image

నెల్లూరు కార్పొరేషన్‌కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్‌లో సమావేశం ఉంటుంది. ఇన్‌ఛార్జ్ మేయర్‌ రూప్‌ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.