News January 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔పాలమూరు ప్రాజెక్ట్‌కు జైపాల్ రెడ్డి పేరు ఎలా పెడతారు: ఎంపీ డీకే అరుణ✔వడ్డేమాన్‌: సంపులో పడి యువరైతు మృతి✔NGKL మాజీ ఎంపీకి జూపల్లి పరామర్శ✔ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి✔MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్✔MBNR:7 నుంచి సదరం క్యాంపులు ✔రేపటి నుంచి సీసీ టీవీ కెమెరా సర్వీసింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ప్రారంభం✔పలుచోట్ల పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు 

Similar News

News January 13, 2025

కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కల్వకుర్తిలోని <<15140785>>లారీ ఢీకొట్టిన<<>> ఘటనలో ఒకరు మృతిచెందారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు, వంగూర్ మం. కోనేటిపురం వాసి శ్రీను రాచూరులోని కాఫీ కంపెనీలో పనిచేస్తున్నారు. అదివారం రాత్రి సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదుట కంపెనీ వాహనం కోసం వేచి ఉండగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగరాజు లారీ టైర్ల కిందపడి చనిపోగా శ్రీనును ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 13, 2025

విద్యాసంస్థల్లో మతోన్మాదుల జోక్యం అడ్డుకోవాలి: ప్రొ.హరగోపాల్

image

పాఠశాలల్లో మతోన్మాదుల జోక్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. మతాలకు సంబంధించిన చిహ్నాలు, దుస్తులను విద్యాసంస్థల్లో నిషేధించాలని కోరారు. తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం రాములుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

News January 13, 2025

మంద జగన్నాథం మృతి పట్ల సీఎం సంతాపం

image

నాగర్‌కర్నూల్ మాజీ MP మంద జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.