News July 17, 2024
ఊట్కూర్: పాముకాటుతో యువకుడి మృతి

ఊట్కూరు మండలం పులిమామిడికి చెందిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బి. హనుమంతు చిన్న కొడుకు శివ(20) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతతో వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు NRPTఆసుపత్రికి తరలించగా పాము కాటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి MBNR ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెంచాడు
Similar News
News February 12, 2025
భవిష్యత్తు మీదే:ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

భవిష్యత్తు మీదే అని మహబూబ్ నగర్ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు తన సొంత నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10వతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
News February 11, 2025
MBNR: ఈనెల 14 ,15వ తేదీల్లో మహానగరోత్సవం

ఈనెల 14 ,15వ తేదీలలో మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో మహబూబ్ నగర్ మహానగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మంగళవారం శిల్పారామం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News February 11, 2025
MBNR: జీరో(0) బిల్లు.. ఉమ్మడి జిల్లాలో ఎంతమందంటే!

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.