News November 6, 2025

ఊట్కూర్: మారనున్న పెద్ద చెరువు రూపురేఖలు

image

నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ఊట్కూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువును విస్తరించి రిజర్వాయర్‌గా మార్చనున్నారు. దీని నిలువ సామర్థ్యం 0.27 టీఎంసీలు. 19 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రెషర్ మెయిన్ పద్ధతిలో జయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్ ఎత్తిపోస్తారు. భూసేకరణ జరిగిన, డబ్బు రైతు ఖాతాలో జమ కాలేదు.

Similar News

News January 16, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

image

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News January 16, 2026

నిర్మల్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణానికి 1176 ఎకరాల సేకరణ

image

సదర్మాట్ బ్యారేజీ ద్వారా ఉమ్మడి ADB, NZB, KNR జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది. 1.58 TMCల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం 1176 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో NRML జిల్లాలో 805, JGTL జిల్లాలో 317 ఎకరాలు ఉన్నాయి. ఈ బ్యారేజీ ద్వారా 13,210 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, JGTL జిల్లాలోని 4,896 ఎకరాలకు నీరు అందుతుంది. బ్యాక్ వాటర్ ద్వారా NZB జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కలగనుంది.

News January 16, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

image

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.