News August 20, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

డా. బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ డిగ్రీ రెండవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు వర్శిటీ ఎగ్జామ్స్ యూజీ డీన్ డా. జి. పద్మారావు ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఏప్రిల్లో జరిగిన డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 5,957 మంది విద్యార్థులు హాజరు కాగా 37.58 శాతం మంది ఉత్తీర్ణత చెందారన్నారు. రిజల్ట్స్ను జ్ఞానభూమి పోర్టల్లో చూడాలన్నారు.
Similar News
News January 24, 2026
జలమూరులో యాక్సిడెంట్ స్పాట్లో ఒకరు మృతి

జలుమూరు మండలం చల్లవానిపేట చెరువు మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 14 ఏళ్ల బాలుడు ఋషి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. చోదకుడితో పాటు బైక్పై ఉన్న వారికి గాయాలవ్వడంతో స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 24, 2026
SKLM: నేటి సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు..!

రథసప్తమి వేడుకల్లో భాగంగా శనివారం నాటి వివరాలు ఇలా…
*సాయంత్రం 6.గం లకు తన్మయి శాస్త్రీయ నృత్యం, గణపతి శర్మ, యామిని కర్రిల మ్యూజికల్ షోలు,
రాత్రి 7:00 నుంచి థమన్ లైవ్ కాన్సర్ట్, ఢీ డాన్సర్స్ ఆక్సా ఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శనలు,* సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, చంద్రికలు యాంకర్లుగా, డ్రోన్ షో కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
News January 24, 2026
ఆమదాలవలస మహిళకు జిల్లా బాధ్యతలు

వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఆమదాలవలసకు చెందిన అజంత కుమారిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. పార్టీ మహిళా విభాగం కమిటీ నియామకంలో భాగంగా అజంతా కుమారిని జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. తనకిచ్చిన గుర్తింపును బాధ్యతగా నిర్వహిస్తామని తెలిపారు.


