News November 8, 2025
ఎడ్యుకేషనల్ హబ్గా కుప్పం: సీఎం చంద్రబాబు

AP: కుప్పంలో రూ.2,203కోట్ల పెట్టుబడితో 7 సంస్థల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాం. ప్రైవేట్, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తాం. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి’ అని తెలిపారు. కుప్పంలో ల్యాప్టాప్, మొబైల్ యాక్సెసరీస్ వంటి 7 సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాలు కేటాయించింది.
Similar News
News January 23, 2026
కేసీఆర్ చుట్టే ప్రశ్నలు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను HYD సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం రెండు గంటలుగా ప్రశ్నిస్తోంది. కాగా పదే పదే కేసీఆర్ చుట్టే ఆయన్ను ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్కు పర్మిషన్ ఇచ్చిందెవరు? ఎవరు చేయమని చెప్పారు? అనే ప్రశ్నలతో పాటు ట్యాపింగ్కు కేసీఆర్ కారణమా? అనే యాంగిల్లో ప్రశ్నలు సంధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
News January 23, 2026
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలి: RS ప్రవీణ్

TG: ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం. ఇలా చేయొచ్చని చట్టమే చెబుతోంది. ఫోన్లు, ఈమెయిల్స్ ట్యాపింగ్ చేస్తున్నామని గతంలో మన్మోహన్ పార్లమెంటులో చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం బజారున పడేసింది’ అని మండిపడ్డారు.
News January 23, 2026
వింతల ప్రపంచం.. గ్రీన్లాండ్ ప్రత్యేకతలివే

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్లో 80% ప్రాంతం మంచుతోనే నిండి ఉంటుంది. కేవలం 56,000 జనాభా కలిగిన ఈ దేశంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి రోడ్లు ఉండవు. పడవలే ప్రయాణ సాధనం. ఇక్కడి గాలి, నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవి. చెట్లు దాదాపుగా లేని ఈ గడ్డపై ప్రజలు మనుగడకు వేట, ఫిషింగ్పైనే ఆధారపడతారు. డెన్మార్క్, ఐస్లాండ్ నుంచి మాత్రమే చేరుకోగల ఈ దేశంలో అర్ధరాత్రి సూర్యుణ్ని చూడొచ్చు.


