News April 13, 2025
ఎన్టీఆర్: అమరావతి శంకుస్థాపనకు చురుకుగా ఏర్పాటు

ఈనెల 24-26 తేదీల మధ్య రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలను సమీకరణ చేయనున్నారు. సుమారు 5 నుంచి 5 లక్షల మధ్య ప్రజలు రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు సిద్ధం చేస్తున్నారు. అతిథుల కోసం 4 హెలీప్యాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Similar News
News January 19, 2026
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
News January 19, 2026
PPP విధానంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి

AP: రాష్ట్రంలోని ప్రధాన RTC బస్టాండ్లను PPP విధానంలో ₹958 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోనగర్ (విజయవాడ), గుంటూరు, కర్నూలు, మద్దిలపాలెం (విశాఖ), చిత్తూరు బస్టాండ్ల విస్తరణ, ఆధునికీకరణ చేయనున్నారు. తిరుపతి బస్టాండ్ అభివృద్ధి పనులు కేంద్ర సహకారంతో ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రైవేటు సంస్థలు ముందుకు రాగానే ఇతర బస్టాండ్ల పనులూ చేపడతారు.
News January 19, 2026
మేడారం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి ట్వీట్

మన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలను కాపాడుతూ, మన చారిత్రక వైభవం, ఘనమైన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడమే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. సమ్మక్క-సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్ల పాటు చిరస్థాయిగా నిలిచేలా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.


