News April 23, 2025

ఎన్టీఆర్: ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించిన అధికారులు

image

మే 2న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంబంధిత రూట్ మ్యాప్‌ను అధికారులు బుధవారం పరిశీలించారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అనుసంధానమై ఉన్న సీడ్ యాక్సిస్ రహదారుల జంక్షన్‌లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్‌, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్, NHAI ప్రాజెక్టు డైరక్టర్ పార్వతీశం,CRDA అధికారులతో కలసి ఆయా రహదారులను రూట్ మ్యాప్ నిమిత్తం పరిశీలించారు.

Similar News

News March 6, 2026

అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 208 మంది గైర్హాజర్

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. 6,575 మంది హాజరు కావలసి ఉండగా 6,367 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

News March 6, 2026

తుఫానులకు నష్టం జరగకుండా చర్యలు: హోంమంత్రి

image

భవిష్యత్తులో వచ్చే తుఫానులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతూ 2014-19 మధ్య సీఎం చంద్రబాబు 219 తుఫాన్ షెల్టర్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. పైగా డిజాస్టర్ మేనేజ్మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.

News March 6, 2026

దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.