News December 2, 2025
ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 దశల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. ఇందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 10, 2026
మంచిర్యాల: పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు

సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు బుధవారం వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు, పోలింగ్ నిర్వహణ కోసం స్థానిక సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు.
News February 10, 2026
మంచిర్యాల: భూములు కోల్పోయిన బాధితులకు చెక్కులు

మంచిర్యాలలోని కేతనపల్లి మీదుగా ఏర్పాటుచేసిన జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన బాధితులకు కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ రహదారిలో భూములు కోల్పోయిన 19 మందికి రూ.1.30కోట్లు నష్టపరిహారంగా అందించామన్నారు.
News February 10, 2026
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.


