News December 1, 2025
ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ నరసింహ

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. పెన్ పహాడ్ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
Similar News
News February 18, 2026
తిరుపతిలో లిఫ్ట్ ఇస్తే చైన్ కొట్టేశాడు..!

తిరుపతి రూరల్ పేరూరుకు చెందిన రఘునాథ్ రెడ్డి(36) బైకుపై వెళ్తుండగా చెర్లోపల్లిలోని వైన్ షాపు వద్ద ఓ వ్యక్తి లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నాడు. పాస్ వస్తుందని జూపార్క్ సమీపంలో బైకు ఆపాలని కోరాడు. తిరిగి బైక్ ఎక్కే సమయంలో రఘునాథ రెడ్డి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్ను అతడు లాక్కెళ్లిపోయాడు. నిందితుడు వైట్ కలర్ టీ షర్ట్పై బ్లూ కలర్ జాకెట్ ధరించి ఉన్నాడు. అతడిని గుర్తిస్తే చెప్పాలని పోలీసులు కోరారు.
News February 18, 2026
కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి అబద్ధాల కోరు: కాంగ్రెస్ నేతలు

కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర ఉన్న MLAకు, షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో అబద్ధాలు చెప్పారని, రూ.150 కోట్ల అభివృద్ధిపై ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఐటీ శాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
News February 18, 2026
ADB: బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

ఐటీఐ 2 సంవత్సరాల కోర్సులో పాసైన విద్యార్థుల నుంచి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 21లోపు సర్టిఫికెట్లతో కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 60% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందన్నారు.


