News September 12, 2025
ఎన్ హెచ్-16 డీపీఆర్పై అనకాపల్లి ఎంపీ సమీక్ష

అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు ఎన్ హెచ్-16 విస్తరణకు సంబంధించి డీపీఆర్ తయారీకి అనకాపల్లి కలెక్టరేట్ లో శుక్రవారం కలెక్టర్,జేసీ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లతో ఎంపీ సీఎం రమేష్ సమీక్ష నిర్వహించారు. ఈ రహదారిని ఆరు లైన్లకు విస్తరించనున్నారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు.ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
ఆదిలాబాద్లో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు

10వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ఆదిలాబాద్లో నిర్వహించనున్నట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్ తెలిపారు. ఈ నెల 7న జిల్లా స్థాయి, 8,9వ తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారి వయస్సు ప్రకారం 5 గ్రూపులుగా విభజించినట్లు తెలిపారు.
News December 5, 2025
సిరిసిల్ల: ‘బస్సులో నగదు బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్’

డబ్బుల బ్యాగులు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగును బస్సులో నుంచి బండారి బాలరాజు ఎత్తుకెళ్లాడన్నారు. ఆ బ్యాగులో రూ.3,97,500 నగదు ఉందని బాధితులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


