News October 7, 2025

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై భువనగిరి పీఎస్‌లో ఫిర్యాదు

image

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ ఫిర్యాదును అందజేశారు. జేఏసీ నాయకులు మహమ్మద్ అతహర్, షరీఫ్, ఇబ్రహీం మాట్లాడుతూ.. రాజాసింగ్ బహిరంగ సభలో రెచ్చగొట్టే, కించపరిచే వ్యాఖ్యల చేశారని, తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు.

Similar News

News January 22, 2026

చక్రాయపాలెంలో ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు

image

అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి అద్దంకి సాధించగా, రెండో బహుమతి చక్రాయపాలెం అందుకుంది. మూడో స్థానంలో కొమ్మినేని వారిపాలెం నిలవగా విజేతలకు సీఐ సుబ్బరాజు హాజరై బహుమతులు ప్రదానం చేశారు.

News January 22, 2026

మదనపల్లి బస్టాండులో పెద్దమండెం వ్యక్తి మృతి..!

image

మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించింది. 2-టౌన్ SI రహీముల్లా, ఏఎస్ఐ రమణలు సీఐ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దమండెం మండలం వెలిగల్లు కాలానీకి చెందిన శంకరప్ప కొడుకు<<18916147>> మారుతీగా గుర్తించారు.<<>> మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఏఎస్ఐ రమణ తెలిపారు.

News January 22, 2026

విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

image

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.