News December 15, 2024

ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

image

దేశవ్యాప్తంగా 12 ఎయిమ్స్‌కి పాలక మండలి సభ్యుడిగా 24 మంది లోక్‌సభ ఎంపీలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌కి పాలక మండలి సభ్యుడిగా మహబూబ్‌నగర్ ఎంపీ( బీజేపీ) డీకే అరుణతో పాటు భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డిని నియమించారు.

Similar News

News January 19, 2025

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎస్ఎస్సీ, ఆర్అర్బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీజీ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఖాజానజీమ్ అలీ అప్సర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9లోగా వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 19, 2025

చెరువుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!

image

చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం <<15183553>>ప్రసిద్ధ శైవక్షేత్రంగా<<>> భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడైన తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.

News January 19, 2025

పెరిగిన యాదగిరీశుడి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం 1500 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.12,32,330, VIP దర్శనాలు రూ.6,75,000, బ్రేక్ దర్శనాలు రూ.2,58,600, కార్ పార్కింగ్ రూ.5,50,000, వ్రతాలు రూ.1,42,400, సువర్ణ పుష్పార్చన రూ.97,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,487 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.