News August 25, 2024
ఎర్రగుంట్లకు తెలుగు భాషకు ఉన్న అనుబంధం ఇదే.!

ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదివారం అధికారులకు సూచించారు. తెలుగు భాష ప్రారంభానికి చిహ్నమైన తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలం కలమల్లలో క్రీస్తుశకం 575వ సంవత్సరంలో రేనాటి చోళ రాజు ధనుంజయ వర్మ వేయించారని, అక్కడ తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ప్రతిష్ఠాత్మకమని తెలిపారు.
Similar News
News January 17, 2026
కడప టు ఢిల్లీ

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.
News January 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,330
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,184
* వెండి 10 గ్రాములు ధర రూ.2,810
News January 17, 2026
కడప: నదిలో మృతదేహం కలకలం

కడప జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతదేహం నంద్యాల జిల్లాలోని కుందూ నదిలో లభ్యమైంది. శూలం లక్ష్మీదేవి తరచుగా కోయిలకుంట్ల(M) కలుగొట్ల కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు, సంజామల(M) వసంతాపురం గ్రామానికి వచ్చేదని ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


