News April 7, 2025

ఎలమంచిలి: నువ్వులో కొత్త వంగడాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు

image

ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కొత్త నువ్వు వంగడం వైఎల్ఎల్-149 ను రూపొందించారు. కేంద్ర విత్తన ఎంపిక కమిటీ ఈ వంగడం విడుదలకు ఆమోదం తెలిపినట్లు స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్త శిరీష ఆదివారం తెలిపారు. కొత్త నువ్వు వంగడం ఎకరానికి ఐదారు క్వింటాళ్ల అధిక దిగుబడి ఇస్తుందని ప్రయోగాత్మక సాగులో నిర్ధారణ అయిందన్నారు. విత్తిన 80 నుంచి 85 రోజుల్లో పంట కోతకు వస్తుందని అన్నారు.

Similar News

News April 19, 2025

సిద్దిపేట: మిత్రులతో ఆడుతుండగా బాలుడి మృతి

image

కరెంట్ షాక్ తగిలి <<16142215>>విద్యార్ధి మృతి<<>> చెందిన ఘటన తోగుట(M)లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. తుక్కాపూర్‌‌కు చెందిన చికుడ్క స్వామి గురువారం రాత్రి తన ఇద్దరి కుమారులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లారు. గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు విద్యుత్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ వైరు ఇనుప పైపునకు తగిలిఉంది. ప్రణీత్ ఆడుకుంటూ ఇనుప పైపునకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 19, 2025

మెదక్: అగ్నివీర్‌ దరఖాస్తులు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT

News April 19, 2025

జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జి

image

అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం గద్వాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వరుడికి రుద్రాభిషేకాలు అనంతరం జోగులాంబ అమ్మవారికి కుంకుమ అష్టోత్తర అర్చనలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.

error: Content is protected !!